Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేయసితో శృంగారం చేస్తున్న వ్యక్తిని లాక్కొచ్చి బట్టల్లేకుండా నిలబెట్టి చితకబాదారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన చూరు జిల్లాలోని తారనగర్ లో చోటుచేసుకుంది.దీంతో ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ఆ ప్రాంతం లోని రాజ్ కుమార్ (25) అనే యువకుడు విధి చివర ఉన్న 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆ తరువాత ఆ యువతీ కూడా అతడితో చనువుగానే తిరగడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత వీరి కలయికగా ఇంకాస్త దగ్గరైంది.

చివరకు బెడ్ రూమ్ కార్యకలాపాలవరకు వెళ్ళింది. తన ఇంటికి తీసుకొచ్చి మరి రోజు ఆ యువతి తో శృంగారం జరిపేవాడు రాజ్. ఆ విధంగా అది కాస్త ముదిరి ఏకంగా యువతి ఇంట్లోనే రొమాన్స్ చేయడానికి సిద్దమయ్యాడు. ఓ రోజు ఆ యువతి కుటుంబ సభ్యులు లేని విషయాన్ని గమనించి ప్రియురాలితో శృంగారం చేయసాగాడు. కానీ ఇంతలోనే ఆ యువతి కుటుంబ సభ్యులు వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదారు. దీంతో పరిసర ప్రాంత వాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన రాజ్ కుమార్ ని హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆ యువకున్ని కొట్టిన నిందితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.