కావల్సినవి: కొత్తబియ్యం – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత, బెల్లం – కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు
తయారీ: ∙బియ్యం రెండుగంటల సేపు నానబెట్టాలి. నీళ్లు వడగట్టాలి. పిండి మెత్తగా వడలకు తగిన విధంగా రుబ్బుకోవాలి. ∙వేడినీళ్లలో బెల్లం వేసి కరిగించి, పాకం పట్టాలి. ∙బాణలిలో నూనె పోసి, కాగనివ్వాలి. చేతులు తడిలేకుండా చూసుకొని చేతిమీద గానీ, అరటి ఆకు మీదగానీ నిమ్మకాయ పరిమాణంలో పిండి తీసుకొని అదిమి మధ్యకు పెద్ద రంధ్రం చేయాలి. ∙ఇలా చే సిన దాన్ని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వదలాలి. సన్నని మంట మీద రెండువైపులా వేయించాలి. ∙గారె బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాక తీసి బెల్లం పాకంలో వేయాలి. మరో గారె సిద్ధమైంతవరకు బెల్లం పాకంలో గారెను ఉంచి, తర్వాత తీసి ప్లేట్లో పెట్టాలి. వేడి వేడిగా సర్వ్ చేస్తే కరకరలాడుతూ బెల్లం గారెలు రుచిగా ఉంటాయి. వీటిని పెసరపప్పు, మినప్పప్పుతోనూ చేసుకోవచ్చు.