Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కావల్సినవి: కొత్తబియ్యం – పావు కేజీ, బెల్లం – పావు కేజీ, పచ్చికొబ్బరి తురుము – కప్పు, నూనె – వేయించడానికి తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్లు

తయారీ: ∙బియ్యం కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. బియ్యంలో నీళ్లు వంపేసి కాటన్‌ క్లాత్‌లో వేసి పది నిమిషాలు మూటకట్టాలి. ఈ బియ్యాన్ని రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి మెత్తటి పిండి చేసుకోవాలి. బెల్లాన్ని తురిమి ఒక గిన్నెలో వేసి దాంట్లో పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. దీంతో బెల్లం కరుగుతుంది. ఇలా కరిగిన బెల్లంలో కొబ్బరి తురుము వేసి కలపాలి. కొంచెం జిగురుగా అయ్యేంతవరకు ఉంచి, నెయ్యి వేసి కలపాలి. తర్వాత దీంట్లో బియ్యప్పిండి వేస్తూ అదేపనిగా కలుపుతూ ఉండాలి. దీంట్లో 2 టీ స్పూన్ల నూనె వేసి కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న బియ్యప్పిండి చల్లారిందా లేదా చూసుకొని నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను పాలిథిన్‌ కవర్‌ మీద పెట్టి, వెడల్పుగా వత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వడ్డించాలి.