లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని లాతూర్లో చేసిన వ్యాఖ్యలపై విపక్షాల ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈనెల 9న లాతూర్లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ బాలాకోట్లో వైమానిక దాడులు జరిపిన వారిని తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు ఎన్నుకోవాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
విపక్షాలు ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని ప్రసంగాన్ని తెప్పించుకున్నామని, దాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ అధికారి చంద్ర భూషణ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి వివరణను తాము ఇప్పుడు వెల్లడించలేమని చెప్పారు.