Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టాలీవుడ్ రెండు కుటుంబాలకు చెందిన హీరోలు వెండితెరపై పోటీపడటం సాధారణం. ఆ విషయాన్ని హీరోలు అంత పెద్దగా పట్టించుకోకపోయినా అభిమానుల మధ్యలో మాత్రం తీవ్ర స్థాయిలో ఆ ఆలోచన ఉంటుంది. అయితే వచ్చే నెల ఇద్దరి టాలీవుడ్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఆ హీరోలిద్దరు ఒకే హీరోను ఇష్టపడతారు. ఒకరు కుటుంబం తరఫు నుంచి అయితే మరొకరు చిన్నప్పటినుండి హార్డ్ కొర్ ఫ్యాన్ . వారు ఎవరో కాదు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరియి నితిన్. వీరిద్దరూ పవన్ కి ఏ స్థాయిలో అభిమానుల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ యువ హీరోలకి పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ బాగానే ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ హీరోలు ఒకేరోజు వెండితెరపై పోటీపడబోతున్నారు. ఒకరు లవర్ బాయ్ గా వస్తుంటే మరొకరు జవాన్ గా వస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు షూటింగ్ ను దాదాపు పూర్తిచేసుకొని డబ్బింగ్ పనులల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నితిన్ లై చిత్రం నుండి ఓ పాట విడుదల చేశారు. అయితే త్వరలో సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ లోని ఓ పాటను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాలు రెండు ఒకే తేదీన రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. ఆగస్టు 11న వెండితెరపై పోటీ పడేందుకు ఈ పవన్ ఫాన్స్ సినిమాలు రిలీజ్ చేయనున్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో చూడాలి.